పడవ బోల్తా.. 40 మంది మిస్సింగ్
- August 18, 2025
నైజీరియాలోని వాయువ్య సోకోటో రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్కు వెళ్తున్న ఓ పడవ ప్రమాదాని కి గురైంది.ఈ ప్రమాదంలో 40 మంది గల్లంతు అయ్యారు. ప్రమాదసమయంలో పడవలో 50మంది ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. కాగా 10మందిని ప్రాణాలతో రక్షించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.
అధికారులు గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాణాలతో బయటపడ్డవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఇటీవల తరచుగా నైజీరియాలో పడవ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో కరువు, అంతర్గత పోరాటాల కారణంగా చాలామంది అక్రమంగా పొరుగుదేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రమాదకరమైన చిన్న పడవలలో ప్రయాణిస్తూ, మత్యువాత పడుతున్నారు. పడవ యజమానులు సైతం డబ్బు ఆశతో సామర్థ్యానికి మించిన ప్రయాణికులను తీసుకెళ్తూ, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి, ఇలాంటి ప్రమాదలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









