365 రోజుల మెట్రోపాస్ను ఆవిష్కరించనున్న ఖతార్ రైలు..!!
- August 20, 2025
దోహా: దోహా మెట్రోలోని స్పోర్ట్ సిటీ స్టేషన్లో బ్యాక్ టు స్కూల్ ఈవెంట్ సందర్భంగా ఖతార్ రైలు, కొత్త 365 రోజుల మెట్రోపాస్ను ప్రారంభించనుంది. 990 ఖతార్ రియాల్స్ ధరతో, ఈ పాస్ దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ నెట్వర్క్లో అపరిమిత రైడ్స్ పొందవచ్చు.
ఖతార్ రైల్ సెప్టెంబర్ 2వరకు దోహా మెట్రో స్పోర్ట్ సిటీ స్టేషన్లో "బ్యాక్ టు స్కూల్" ఈవెంట్ రెండవ ఎడిషన్ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సందర్శకులకు ప్రత్యేకమైన ఎర్లీ బర్డ్ ప్రమోషన్ను అందిస్తుంది. దీని ద్వారా వారు 20% తగ్గింపుతో మెట్రో పాస్ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 31వరకు ఈవెంట్లో ఎర్లీ బర్డ్ వోచర్లను ప్రత్యేకంగా పొందవచ్చు. వాటిని సెప్టెంబర్ 30 మధ్య ఏదైనా దోహా మెట్రో గోల్డ్ క్లబ్ కార్యాలయం లేదా లుసైల్ ట్రామ్ టికెటింగ్ కార్యాలయంలో కొనుగోలు సమయంలో అవసరమైన అసలు వోచర్తో రీడీమ్ చేసుకోవచ్చు.
మెట్రో గోల్డ్ లైన్లోని స్పోర్ట్ సిటీ స్టేషన్లో ఈ ఈవెంట్ వారాంతపు రోజులలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, వారాంతాల్లో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నారు. పిల్లలు, ఫ్యామిలీ కోసం ఇంటరాక్టివ్ గేమింగ్ జోన్, పెయింటింగ్, కలరింగ్ మరియు ఆర్ట్ అనుభవాలు, వివిధ పోటీలలో విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాలను అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!