UK 79వ గ్రూప్ దుబాయ్ ఆఫీస్ ఖాళీ..దిక్కుతోచని స్థితిలో ఇన్వెస్టర్లు..!!

- August 21, 2025 , by Maagulf
UK 79వ గ్రూప్ దుబాయ్ ఆఫీస్ ఖాళీ..దిక్కుతోచని స్థితిలో ఇన్వెస్టర్లు..!!

దుబాయ్: UKలోని ఒక ప్రాపర్టీ నిర్వహణ సంస్థ తన దుబాయ్ కార్యాలయాన్ని ఖాళీ చేసింది. వెబ్‌సైట్‌ను మూసివేసింది. పలు ఆరోపణలతో లైసెన్స్‌ ను దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ పునరుద్ధరించలేదు. దాంతో దాంట్లో పెట్టుబడులు పెట్టిన యూఏఈకి చెందిన పెట్టుబడిదారుల ఆశలు సన్నగిల్లుతున్నాయి.

2023లో దుబాయ్ కార్యాలయాన్ని ప్రారంభించిన డెబ్బై తొమ్మిదవ యూకే గ్రూప్. మోసం తదితర అరోపణలతో లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  కంపెనీ UK ఆస్తులపై సెక్యూర్డ్ చేయబడిన స్ట్రక్చర్డ్ లోన్ నోట్‌లను విక్రయించింది. పెట్టుబడిదారులకు 15 నుండి 18 శాతం వార్షిక రాబడిని హామీ ఇచ్చింది. నష్టపోయిన ఆస్తులను కొనుగోలు చేయడానికి, వాటిని పునరుద్ధరించడానికి మరియు చెల్లింపులను చేయడానికి, సొంత లాభం కోసం పెట్టుబడిదారుల నిధులను ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు సంస్థ ఎటువంటి తప్పు చేయలేదని ఒక ప్రకటన విడుదల చేసింది. "ప్రస్తుతం UKలో కోర్టు చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి మేము పెద్దగా చెప్పలేము, కానీ మేము వీలైనంత త్వరగా లైసెన్స్‌లను పునరుద్ధరించాలని చూస్తున్నాము." అని తెలిపింది.

కాగా, పోలీసుల విచారణ పేరుతో గ్రూప్ ఈ సంవత్సరం ప్రారంభంలో చెల్లింపులను నిలిపివేసింది. ఎంత మంది పెట్టుబడిదారులు ప్రభావితమయ్యారో స్పష్టంగా తెలియదు.  కానీ ఈ సంఖ్య 3,000 దాటవచ్చని, £200 మిలియన్లకు పైగా పెట్టుబడులు సేకరించినట్టు భావిస్తున్నారు.

తాజాగా నార్తంబర్‌ల్యాండ్‌లోని ఒక పాత ఆసుపత్రి భూములు, వారింగ్టన్‌లోని కార్యాలయాలు వంటి ఆస్తులను అమ్మకానికి పెట్టినట్లు చెప్పారు.  అయితే, దర్యాప్తులో భాగంగా లండన్ నగర పోలీసులు ఈ సంవత్సరం ప్రారంభంలో మెర్సీసైడ్‌లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, తరువాత వారిని బెయిల్‌పై విడుదల చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com