పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే..15 రోజులపాటు మూసివేత..!!

- August 22, 2025 , by Maagulf
పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే..15 రోజులపాటు మూసివేత..!!

దోహా: ఖతార్ లో నిబంధనల ప్రకారం వాణిజ్య సముదాయాలు, సంస్థలు పనిచేయాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) తేల్చిచెప్పింది. నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని పేర్కొంది. పాదచారులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం, నిబంధనలను పాటించకపోవడం వంటి చర్యలకు పాల్పడితే.. ఖతార్ లో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం..ఆయా సంస్థలను 15 రోజులపాటు మూసివేయడంతోపాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ లో వెల్లడించింది.    

మరోవైపు ఖతార్ వ్యాప్తంగా ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని అనెక రెస్టారెంట్లతోపాటు  పలు ఫుడ్ ఆధారిత కంపెనీలను మూసివేయించారు.  ప్రజారోగ్యానికి , వినియోగదారుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిగణించబడుతున్న పద్ధతులను సహించమని స్పష్టం చేసింది.  16001లో హాట్‌లైన్‌ను సంప్రదించడం ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా మంత్రిత్వశాఖ అప్లికేషన్‌ను ద్వారా ఫిర్యాదులు చేయాలని సూచించారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com