85 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు సీజ్..ఇద్దరు అరెస్టు
- August 23, 2025
మస్కట్: అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్వర్క్లతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఫర్ కాంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కచ్చితమైన పర్యవేక్షణ మరియు ట్రాకింగ్ ఆపరేషన్ ద్వారా డ్రగ్ నెట్ వర్క్ ను ఛేదించినట్టు తెలిపింది.
అనుమానితుల వద్ద 85 కిలోగ్రాములకు పైగా హషీష్, గంజాయి, అలాగే 70,000 సైకోట్రోపిక్ మాత్రలను సీజ్ చేసినట్టు వెల్లడించింది. మాదకద్రవ్యాలను ఖురియాత్ తీరం వెంబడి ఒక ప్రదేశంలో దాచిపెట్టి, వాహనంలో తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్