కేరళలో దుబాయ్ నివాసి కిడ్నాప్..!!

- August 31, 2025 , by Maagulf
కేరళలో దుబాయ్ నివాసి కిడ్నాప్..!!

దుబాయ్: దుబాయ్ నివాసి కేరళలో కిడ్నాప్ కు గురైనట్లు తెలుస్తోంద.  ఎనిమిది మంది సభ్యుల ముఠా కిడ్నాప్ అతడిని కిడ్నాప్ చేసిందని,  తరువాత పోలీసులు రక్షించారని స్థానిక మీడియా తెలిపింది. 

కిడ్నాప్ కు గురైన బాధితుడిని 30 ఏళ్ల వయసున్న వయనాడ్‌కు చెందిన రహీస్‌గా గుర్తించారు.  కోజికోడ్‌లో కిడ్నాప్ కు గురయ్యాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితులు అరెస్టు చేయడంతో.. అతడు సురక్షితంగా బయటపడ్డాడు.

 ఇటీవల యూఏఈకి చెందిన ప్రవాసులు కేరళలో కిడ్నాప్ కు గురి కావడం ఇది రెండోసారి. ఆగస్టు 12న మలప్పురంలో  యూఏఈకి దుబాయ్ ఫార్మసీ చైన్ సహ యజమాని అయిన VP షమీర్ మెడాన్ కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అతడిని రోజుల వ్యవధిలో పోలీసులు రక్షించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com