30శాతం డిస్కౌంట్స్ ప్రకటించిన ఎతిహాద్ ఎయిర్వేస్..!!
- September 08, 2025
యూఏఈ: ఈ వింటర్ సీజన్ కోసం ఎతిహాద్ ఎయిర్వేస్ 30 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఆసియా మరియు ఆఫ్రికాలోని కొన్ని గమ్యస్థానాలకు తగ్గింపు ధరలు వర్తిస్తాయని తెలిపింది. ఆఫర్ సెప్టెంబర్ 12 వరకు అందుబాబులో ఉంటుంది. తగ్గింపు ధరలతో కొనుగోలు చేసిన టిక్కెట్లతో సెప్టెంబర్ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రయాణించవచ్చు.
థాయిలాండ్లోని క్రాబీ మరియు చియాంగ్ మై, కంబోడియాలోని నమ్ పెన్, అల్జీరియాలోని అల్జీర్స్, ట్యునీషియాలోని ట్యూనిస్, వియత్నాంలోని హనోయ్ మరియు ఇండోనేషియాలోని మెడాన్ వంటి ప్రసిద్ధ నగరాలకు టిక్కెట్ల ధరలు Dh1,835 నుండి ప్రారంభమవుతాయని తెలిపింది. అలాగే, ఇథియోపియాలోని అడిస్ అబాబా మరియు రష్యాలోని కజాన్లకు విమానాలు Dh1,465 నుండి ధరలు ప్రారంభమవుతాయని, హాంకాంగ్కు Dh1,935 నుండి ధరలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. పాకిస్తాన్లోని పెషావర్కు Dh895, తైపీకి Dh1,985 ధరలకే వెళ్లవచ్చని వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







