30శాతం డిస్కౌంట్స్ ప్రకటించిన ఎతిహాద్ ఎయిర్వేస్..!!
- September 08, 2025
యూఏఈ: ఈ వింటర్ సీజన్ కోసం ఎతిహాద్ ఎయిర్వేస్ 30 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఆసియా మరియు ఆఫ్రికాలోని కొన్ని గమ్యస్థానాలకు తగ్గింపు ధరలు వర్తిస్తాయని తెలిపింది. ఆఫర్ సెప్టెంబర్ 12 వరకు అందుబాబులో ఉంటుంది. తగ్గింపు ధరలతో కొనుగోలు చేసిన టిక్కెట్లతో సెప్టెంబర్ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రయాణించవచ్చు.
థాయిలాండ్లోని క్రాబీ మరియు చియాంగ్ మై, కంబోడియాలోని నమ్ పెన్, అల్జీరియాలోని అల్జీర్స్, ట్యునీషియాలోని ట్యూనిస్, వియత్నాంలోని హనోయ్ మరియు ఇండోనేషియాలోని మెడాన్ వంటి ప్రసిద్ధ నగరాలకు టిక్కెట్ల ధరలు Dh1,835 నుండి ప్రారంభమవుతాయని తెలిపింది. అలాగే, ఇథియోపియాలోని అడిస్ అబాబా మరియు రష్యాలోని కజాన్లకు విమానాలు Dh1,465 నుండి ధరలు ప్రారంభమవుతాయని, హాంకాంగ్కు Dh1,935 నుండి ధరలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. పాకిస్తాన్లోని పెషావర్కు Dh895, తైపీకి Dh1,985 ధరలకే వెళ్లవచ్చని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







