30శాతం డిస్కౌంట్స్ ప్రకటించిన ఎతిహాద్ ఎయిర్వేస్..!!
- September 08, 2025
యూఏఈ: ఈ వింటర్ సీజన్ కోసం ఎతిహాద్ ఎయిర్వేస్ 30 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఆసియా మరియు ఆఫ్రికాలోని కొన్ని గమ్యస్థానాలకు తగ్గింపు ధరలు వర్తిస్తాయని తెలిపింది. ఆఫర్ సెప్టెంబర్ 12 వరకు అందుబాబులో ఉంటుంది. తగ్గింపు ధరలతో కొనుగోలు చేసిన టిక్కెట్లతో సెప్టెంబర్ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రయాణించవచ్చు.
థాయిలాండ్లోని క్రాబీ మరియు చియాంగ్ మై, కంబోడియాలోని నమ్ పెన్, అల్జీరియాలోని అల్జీర్స్, ట్యునీషియాలోని ట్యూనిస్, వియత్నాంలోని హనోయ్ మరియు ఇండోనేషియాలోని మెడాన్ వంటి ప్రసిద్ధ నగరాలకు టిక్కెట్ల ధరలు Dh1,835 నుండి ప్రారంభమవుతాయని తెలిపింది. అలాగే, ఇథియోపియాలోని అడిస్ అబాబా మరియు రష్యాలోని కజాన్లకు విమానాలు Dh1,465 నుండి ధరలు ప్రారంభమవుతాయని, హాంకాంగ్కు Dh1,935 నుండి ధరలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. పాకిస్తాన్లోని పెషావర్కు Dh895, తైపీకి Dh1,985 ధరలకే వెళ్లవచ్చని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









