రియల్ ఎస్టేట్, పిల్లల చట్టాలకు కువైట్ ఆమోదం..!!
- September 10, 2025
కువైట్: బయాన్ ప్యాలెస్లో కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటి పీఎం షరీదా అబ్దుల్లా అల్-మౌషెర్జీ క్యాబినెట్ సమావేశ వివరాలను వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా కువైట్ సావరిన్ క్రెడిట్ స్థితిని బలోపేతం చేయడానికి ఆర్థిక సంస్కరణలను కొనసాగించడానికి క్యాబినెట్ ఆమోదించిందని తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ (T2) ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను క్యాబినెట్ ఆదేశించింది.
పిల్లల హక్కులపై 2015 నంబర్ 21 చట్టంలోని కొన్ని నిబంధనలను సవరించే ముసాయిదా చట్టాన్ని మంత్రివర్గం ఆమోదించింది. వజాత శిశువులను తండ్రి జాతీయత పోర్ట్ఫోలియోలో చేర్చనున్నారు. ఆర్టికల్ 81లో పేర్కొన్న విధంగా నిబంధనలను పాటించకపోతే జరిమానాలు విధిస్తారు. ఫత్వా మరియు లెజిస్లేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిక్రీ-లా కోసం వివరణాత్మక మెమోరాండంను సిద్ధం చేస్తుంది. దీనిని హిస్ హైనెస్ అమీర్ ఆమోదం కోసం సమర్పిస్తారు.
1979 డిక్రీ-లా నంబర్ 74 ప్రకారం కువైటీయేతరులు రియల్ ఎస్టేట్ యాజమాన్యంపై నియంత్రణలకు సంబంధించిన ముసాయిదా డిక్రీలను, కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యుడీషియల్ అండ్ లీగల్ స్టడీస్ను క్యాబినెట్ సమీక్షించి ఆమోదించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









