రియల్ ఎస్టేట్, పిల్లల చట్టాలకు కువైట్ ఆమోదం..!!
- September 10, 2025
కువైట్: బయాన్ ప్యాలెస్లో కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటి పీఎం షరీదా అబ్దుల్లా అల్-మౌషెర్జీ క్యాబినెట్ సమావేశ వివరాలను వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా కువైట్ సావరిన్ క్రెడిట్ స్థితిని బలోపేతం చేయడానికి ఆర్థిక సంస్కరణలను కొనసాగించడానికి క్యాబినెట్ ఆమోదించిందని తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ (T2) ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను క్యాబినెట్ ఆదేశించింది.
పిల్లల హక్కులపై 2015 నంబర్ 21 చట్టంలోని కొన్ని నిబంధనలను సవరించే ముసాయిదా చట్టాన్ని మంత్రివర్గం ఆమోదించింది. వజాత శిశువులను తండ్రి జాతీయత పోర్ట్ఫోలియోలో చేర్చనున్నారు. ఆర్టికల్ 81లో పేర్కొన్న విధంగా నిబంధనలను పాటించకపోతే జరిమానాలు విధిస్తారు. ఫత్వా మరియు లెజిస్లేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిక్రీ-లా కోసం వివరణాత్మక మెమోరాండంను సిద్ధం చేస్తుంది. దీనిని హిస్ హైనెస్ అమీర్ ఆమోదం కోసం సమర్పిస్తారు.
1979 డిక్రీ-లా నంబర్ 74 ప్రకారం కువైటీయేతరులు రియల్ ఎస్టేట్ యాజమాన్యంపై నియంత్రణలకు సంబంధించిన ముసాయిదా డిక్రీలను, కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యుడీషియల్ అండ్ లీగల్ స్టడీస్ను క్యాబినెట్ సమీక్షించి ఆమోదించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









