మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- September 10, 2025
దోహా: ఖతార్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు 100 శాతం డిజిటలైజేషన్ను సాధించే దిశగా ఖతార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 2030 వరకు 20 శాతం వార్షిక వృద్ధి రేటుతో పేటెంట్ల సంఖ్యను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వెల్లడించింది. ఈ సందర్భంగా మేధో హక్కులను ఎలా రక్షించుకోవాలో అవగాహనను కల్పిస్తుంది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ చేసింది.
పేటెంట్ దరఖాస్తును దాఖలు చేయడం వల్ల తమ ఆవిష్కరణలకు చట్టపరమైన హక్కు లభిస్తుందని, ఆతర్వాత దానిని తమ అనుమతి లేకుండా ఇతరులు దానిని ఉపయోగించకుండా నిరోధిస్తుందని పేర్కొంది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ సర్వీసును యాక్సెస్ చేయడానికి అవసరమైన దశలవారిగా గైడెన్స్ ఉందని తెలిపింది.
ఈ విషయంలో మంత్రిత్వ శాఖలోని మేధో సంపత్తి హక్కుల రక్షణ విభాగం అవసరమైన సహాయం అందజేస్తుందన్నారు. ట్రేడ్మార్క్లు, కాపీరైట్, రిజిస్టర్డ్ డిజైన్లు మరియు పేటెంట్లకు సంబంధించి కొత్త చట్టాలు 2002 నుండి అమలులో ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









