కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- September 10, 2025
యూఏఈ: దుబాయ్ వ్యాపారవేత్త అనిస్ సాజన్ 700 కి పైగా అసియా కప్ మ్యాచులకు సంబంధించిన టిక్కెట్లను బ్లూ-కాలర్ కార్మికులకు ఉచితంగా అందజేశారు. సెప్టెంబర్ 9న ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, బంగ్లాదేశ్, ఒమన్ మరియు శ్రీలంక జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.
"భారత్ vs పాకిస్తాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ కోసం 100 టిక్కెట్లను పక్కన పెట్టాము. దీంతోపాటు, సూపర్ 4 స్టేజ్ (21న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే) కోసం 100 టిక్కెట్లను మరియు ఫైనల్స్ కోసం మరో 100 టిక్కెట్లను రిజర్వ్ చేసుకున్నాము" అని డానుబే గ్రూప్ వైస్ చైర్మన్ సాజన్ అన్నారు.చాలా మంది కార్మికులకు, తమ క్రికెట్ హీరోలను ప్రత్యక్షంగా చూడటానికి అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
డానుబే గ్రూప్ కంపెనీలలో వివిధ దేశాలకు చెందిన 2,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. లక్కీ డ్రా నిర్వహించి టిక్కెట్లను అందజేసినట్లు వెల్లడించారు. మ్యాచ్లకు హాజరయ్యే కార్మికులకు ఆరోజు పెయిడ్ హాలిడే ఇస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









