మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- October 04, 2025
కౌలాలంపూర్: మలేషియాలో భారతీయ సమాజాల ఐక్యతను ప్రతిబింబిస్తూ, భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) ఆధ్వర్యంలో “దసరా • బతుకమ్మ • దీపావళి 2025” మహోత్సవం ఘనంగా జరిగింది. కౌలాలంపూర్లోని బ్రిక్ఫీల్డ్స్ టానియా బ్యాంక్వెట్ హాల్లో ఈ వేడుకను వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్సభ సభ్యుడు ఈటల రాజేందర్ హాజరై పాల్గొని ఆశీస్సులు అందించారు. అలాగే భారత హైకమిషనర్ మరియు మలేషియా ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని వేడుకకు మరింత విశిష్టతను చేకూర్చారు.
అతిథులు మాట్లాడుతూ, “ఈ వేడుక తెలుగు వారికే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల భారతీయులు ఐక్యంగా జరుపుకున్న ఒక గొప్ప సాంస్కృతిక మహోత్సవం. ఇది నిజంగా భారతీయ సంప్రదాయాలకు అద్దం పట్టిన కన్నుల పండుగ” అని ప్రశంసించారు.
సాంప్రదాయ నృత్యాలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పండుగ ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. మలేషియాలోని భారతీయ NRIలు విస్తృతంగా పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు.
BAM ప్రధాన కమిటీ సభ్యులు:
చోప్పరి సత్య – అధ్యక్షుడు
భాను ముత్తినేని – ఉపాధ్యక్షుడు
రవితేజ శ్రీదశ్యం – ప్రధాన కార్యదర్శి, IT మరియు PR కమ్యూనికేషన్
రుద్రాక్షల సునీల్ కుమార్ – కోశాధికారి
గజ్జడ శ్రీకాంత్ – సంయుక్త కోశాధికారి
రుద్రాక్షల రవికిరణ్ కుమార్ – యువజన నాయకుడు
గీత హజారే – మహిళా సాధికారత నాయకురాలు
సోప్పరి నవీన్, యెనుముల వెంకట సాయి, అపర్ణ ఉగంధర్, సైచరణి కొండ, రహిత, సోప్పరి రాజేష్, పలకలూరి నాగరాజు – కార్యవర్గ సభ్యులు
BAM అధ్యక్షుడు చోప్పరి సత్య మాట్లాడుతూ, “ఈ వేడుకను విజయవంతం చేయడంలో సహకరించిన భారత హైకమిషన్, మలేషియా ప్రభుత్వ అధికారులు, అతిథులు, స్పాన్సర్లు, కమిటీ సభ్యులు మరియు మలేషియాలోని భారతీయ సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.ఈ వేడుక మలేషియాలో భారతీయ సంస్కృతీ సౌహార్దతకు అద్భుతమైన ప్రతీకగా నిలిచింది.


తాజా వార్తలు
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ









