యూఏఈలో విషాదం.. తండ్రి, 7 నెలల శిశువు మృతి, ICUలో తల్లి..!!
- October 08, 2025
యూఏఈ: యూఏఈలో విషాదకరమైన యాక్సిడెంట్ జరిగింది. సోమవారం సాయంత్రం ఖోర్ ఫక్కన్లో రెండు వాహనాల ఢీకొనడంతో 41 ఏళ్ల ఎమిరాటీ తండ్రి, అతని ఏడు నెలల కుమారుడు ప్రాణాలు కోల్పోగా, అతని భార్య మరియు మరొక డ్రైవర్ గాయపడ్డారు.
షార్జా పోలీసుల కథనం ప్రకారం, అక్టోబర్ 6న రాత్రి 8.55 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అతివేగం మరియు ఒక వాహనం అకస్మాత్తుగా పక్కకు జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీంతో వెనకున్న వాహన డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుందని వైద్య అధికారుల తెలిపారు. ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









