నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!
- October 09, 2025
స్టాక్ హోమ్: సౌదీ అరేబియాకు చెందిన సైంటిస్ట్ ఒమర్ యాఘి.. కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. మరో ఇద్దరు సైంటిస్టులు సుసుము కిటగావా మరియు రిచర్డ్ రాబ్సన్లతో కలిసి అవార్డును అందుకోనున్నారు. మెటర్-ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అభివృద్ధి కోసం వీరు కృషి చేశారని, వారి పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హితానికి దోహదం చేశాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. జోర్డాన్లో పాలస్తీనా తల్లిదండ్రులకు జన్మించిన యాఘికి 2021లో సౌదీ పౌరసత్వం లభించింది.
1901లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం ప్రారంభమైంది. మొత్తం 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ($1.2 మిలియన్లు) బహుమతిని అవార్డుతోపాటు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాతో స్థాపించబడిన నోబెల్ బహుమతులు.. సైన్స్, సాహిత్యం మరియు శాంతిలో అత్యుత్తమ విజయాలను సాధించిన వారిని గుర్తించి అందజేస్తారు. స్వయంగా రసాయన శాస్త్రవేత్త అయిన నోబెల్.. డైనమైట్ ఆవిష్కరణ నుండి వచ్చిన తన సంపదను ఒక శతాబ్దం క్రితం అవార్డులను స్థాపించడానికి ఉపయోగించాడు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!
- ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..
- భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!