28 తర్వాత కలిసిన పేగుబంధం
- July 23, 2016
హైదరాబాద్ పోలీస్ ఆరు నెలలపాటు శ్రమించి దుబాయ్కి చెందిన మహిళల్ని, వారి తల్లితో కలిపారు. తల్లి నుంచి 28 ఏళ్ళ క్రితం విడిపోయిన అయేషా మరియు ఫాతిమా రసీద్ ఇటీవల హైదరాబాద్కి వెళ్ళి తమ తల్లి గురించిన సమాచారాన్ని తెలపాల్సిందిగా కోరారు. పోలీసులు ఆరు నెలలపాటు శ్రమించి 60 ఏళ్ళ నజియా బేగమ్ని కనుగొన్నారు. ఆమెను, తన కుమార్తెలతో కలిపేందుకు పోలీసులు సహకరించారు. ఈ సందర్భంగా అయేషా, ఫాతిమాతోపాటు నజియా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తండ్రి రెండో వివాహం చేసుకున్న తర్వాత, తమ తల్లిని దుబాయ్కి పంపేశారనీ, అప్పటినుంచీ తాము తండ్రి వద్దే ఉండిపోయామని తెలిపారు. కర్నాటకలోని బీదర్లో ఫ్రూట్ సెల్లర్గా పనిచేస్తున్న వ్యక్తిని నజియా తిరిగి వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఆ తర్వాత కలిగారు. తమ తల్లిని జీవితంలో కలుసుకోలేమనుకున్నామనీ అయితే హైదరాబాద్ పోలీసుల చొరవతో తల్లిని కలుసుకోగలిగామని అయేషా చెప్పారు. ఇన్నేళ్ళుగా తల్లికి దూరంగా ఉండి చాలా బాధపడ్డామనీ ఇకపై తమ తల్లిని బాగా చూసుకుంటామని పాతిమా చెప్పారు.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









