కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- October 24, 2025
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరులు ప్రాణాలను పణంగా పెడుతున్న వారిపై జీరో టోలరెన్స్ విధానం అమలు చేస్తున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రధాన రహదారి ఉల్లంఘనలపై కఠిన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గత సోమవారం ఒకే రోజు 823 ఉల్లంఘనలతో సహా, కేవలం ఏడు రోజుల్లోనే దాదాపు 4,500 ఓవర్టేకింగ్ కేసులను నమోదు చేశారు. ఉల్లంఘనలను గుర్తించేందుకు అధునాతన కెమెరాలను ఉపయోగిస్తున్నారు.
ఓవర్టేకింగ్ ఉల్లంఘనలతోపాటు ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, పబ్లిక్ రోడ్లపై నో-పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేయడం వంటి నాలుగు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలను 60 రోజుల పాటు సీజ్ చేస్తామని మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







