కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- October 24, 2025
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరులు ప్రాణాలను పణంగా పెడుతున్న వారిపై జీరో టోలరెన్స్ విధానం అమలు చేస్తున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రధాన రహదారి ఉల్లంఘనలపై కఠిన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గత సోమవారం ఒకే రోజు 823 ఉల్లంఘనలతో సహా, కేవలం ఏడు రోజుల్లోనే దాదాపు 4,500 ఓవర్టేకింగ్ కేసులను నమోదు చేశారు. ఉల్లంఘనలను గుర్తించేందుకు అధునాతన కెమెరాలను ఉపయోగిస్తున్నారు.
ఓవర్టేకింగ్ ఉల్లంఘనలతోపాటు ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, పబ్లిక్ రోడ్లపై నో-పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేయడం వంటి నాలుగు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలను 60 రోజుల పాటు సీజ్ చేస్తామని మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







