కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- October 24, 2025
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరులు ప్రాణాలను పణంగా పెడుతున్న వారిపై జీరో టోలరెన్స్ విధానం అమలు చేస్తున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రధాన రహదారి ఉల్లంఘనలపై కఠిన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గత సోమవారం ఒకే రోజు 823 ఉల్లంఘనలతో సహా, కేవలం ఏడు రోజుల్లోనే దాదాపు 4,500 ఓవర్టేకింగ్ కేసులను నమోదు చేశారు. ఉల్లంఘనలను గుర్తించేందుకు అధునాతన కెమెరాలను ఉపయోగిస్తున్నారు.
ఓవర్టేకింగ్ ఉల్లంఘనలతోపాటు ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, పబ్లిక్ రోడ్లపై నో-పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేయడం వంటి నాలుగు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలను 60 రోజుల పాటు సీజ్ చేస్తామని మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







