కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- October 24, 2025
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరులు ప్రాణాలను పణంగా పెడుతున్న వారిపై జీరో టోలరెన్స్ విధానం అమలు చేస్తున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రధాన రహదారి ఉల్లంఘనలపై కఠిన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గత సోమవారం ఒకే రోజు 823 ఉల్లంఘనలతో సహా, కేవలం ఏడు రోజుల్లోనే దాదాపు 4,500 ఓవర్టేకింగ్ కేసులను నమోదు చేశారు. ఉల్లంఘనలను గుర్తించేందుకు అధునాతన కెమెరాలను ఉపయోగిస్తున్నారు.
ఓవర్టేకింగ్ ఉల్లంఘనలతోపాటు ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, పబ్లిక్ రోడ్లపై నో-పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేయడం వంటి నాలుగు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలను 60 రోజుల పాటు సీజ్ చేస్తామని మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









