కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!

- October 26, 2025 , by Maagulf
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!

మస్కట్: ఇండియన్ కమ్యూనిటీ ఫెస్టివల్‌లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పాల్గొన్నారు. అంతకుముందు ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులు అల్ అమెరత్ పార్క్‌లో హాజరయ్యారు. ముఖ్యమంత్రి విజయన్‌ ఓపెన్ జీప్‌లో ఎక్కి జనసమూహానికి అభివాదం చేశారు. మస్కట్‌లో ఒమన్ ఇండియన్ సోషల్ క్లబ్ నిర్వహించిన ఇండియన్ కమ్యూనిటీ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. ఒమన్‌లోని భారత రాయబారి జి.వి. శ్రీనివాస్ మరియు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎ. యూసుఫ్ అలీ, ఒమన్‌లోని మలయాళీ సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు.
తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి విజయన్‌ మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంలోని అధికారులను కూడా కలిశారు.  
1999లో దివంగత E.K. నాయనార్ పర్యటన తర్వాత 26 సంవత్సరాలలో ఒమన్ ను సందర్శించిన కేరళ ముఖ్యమంత్రిగా  విజయన్ చరిత్ర సృష్టించారు. మస్కట్‌లో తన కార్యక్రమాల ముగింపు తర్వాత,  శనివారం సాయంత్రం సలాలా చేరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com