బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- November 01, 2025
మనామా: బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ నిర్వహించిన ఓపెన్ హౌస్ విజయవంతమైంది. భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ అధ్యక్షతన జరిగిన ఓపెన్ హౌస్ లో పలువురు భారతీయ పౌరులు పాల్గొన్నారు. ఎంబసీ కమ్యూనిటీ వెల్ఫేర్ బృందం, కాన్సులర్ బృందం మరియు ప్యానెల్ న్యాయవాదులతో పాటు వివిధ కమ్యూనిటీలకు చెందిన సభ్యులు హాజరయ్యారు.
రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞను చేయించడం ద్వారా రాయబారి జాకబ్ కార్యకలాపాలను ప్రారంభించారు. కమ్యూనిటీ సభ్యులు తమ పాస్పోర్ట్ల చెల్లుబాటును నిరంతరం తనిఖీ చేసుకోవాలని ఆయన సూచించారు. ఏవైనా లాజిస్టికల్ సమస్యలు లేదా అసౌకర్యాన్ని నివారించడానికి సకాలంలో వారి పాస్ పోర్టులను రెన్యూవల్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇండియన్ ఎంబసీ బాధిత భారతీయ పౌరులకు మద్దతుగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
బాధితులకు అవసరమైన బోర్డింగ్ మరియు వసతి అందించడం, అత్యవసర సర్టిఫికెట్లు జారీ చేయడం, విమాన టిక్కెట్లు ఏర్పాటు చేయడం, ప్రవాసుల మృత దేహాల రవాణాకు సహాయం అందించడం వంటి సేవలను ఎంబసీ అందజేస్తుందని వివరించారు. భారత ప్రభుత్వ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఓపెన్ హౌస్ సందర్భంగా పలు కేసులను వెంటనే పరిష్కరించామని, మిగిలిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







