యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- November 17, 2025
యూఏఈ: భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) రెండవ దశ మొదలైంది. దీంతో యూఏఈలోని భారత ప్రవాసులు ఓటర్ల జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు ఇండియాలో వారి కుటుంబాలకు తమ ఐడెంటిటీ ఫోటో కాపీలను పంపుతుండగా, మరికొందరు డిసెంబర్ 9న తదుపరి దశ ప్రక్రియ కోసం వేచి చూస్తున్నారు.
"ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ మరియు గత ఓటరు ID కాపీతో సహా నా అన్ని డాక్యుమెంట్స్ ను నా తల్లిదండ్రులకు అలాగే అవసరమైన ఫారమ్లకు ఫిల్ చేసి పంపాను" అని దుబాయ్ నివాసి అషీమ్ పికె తెలిపారు.
వచ్చే సంవత్సరం ఎన్నికలకు ముందు కేరళ, కర్ణాటకతో సహా 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో SIR విధానాన్ని భారత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. దాదాపు 21 సంవత్సరాల క్రితం చివరిసారిగా పూర్తయిన ఈ ప్రక్రియలో ఓటర్ల వివరాలను ధృవీకరించడం, తప్పుడు ఎంట్రీలను తొలగించడం, కొత్త వాటిని యాడ్ చేయడం జరుగుతుంది.
చాలా మంది ప్రవాస భారతీయులకు (NRI) ఓటింగ్ జాబితాలో తమ పేర్లను చేర్చుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశమని భారత సామాజిక కార్యకర్త మునీర్ బెరికే అన్నారు. ఇండియాలో NRI ఓటరు నమోదు 2010లో ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ 2011లో NRIలను “విదేశీ ఓటర్లు”గా నమోదు చేసుకోవడానికి అనుమతించడం ప్రారంభించింది.
తాజా వార్తలు
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!







