471 కోట్ల రూపాయలకు జబాంగ్‌ ను కొన్న మింత్ర

- July 26, 2016 , by Maagulf
471 కోట్ల రూపాయలకు జబాంగ్‌ ను కొన్న మింత్ర

ప్రముఖ ఈ కామర్స్‌ పోర్టల్‌ ఫ్లిప్‌కార్ట్‌ కుటుంబంలోకి మరో పెద్ద సంస్థ చేరిపోయింది. ఫ్యాషన్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ జబాంగ్‌.కామ్‌ను ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్ర కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ భన్సాల్‌ ధ్రువీకరించారు. జబాంగ్‌ మాతృ సంస్థ 'గ్లోబల్‌ ఫ్యాషన్‌ గ్రూప్‌' నుంచి 70 మిలియన్‌ డాలర్లకు(భారత కరెన్సీలో రూ.471కోట్లు)మింత్రను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే జబాంగ్‌ను కొనుగోలు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్‌, స్నాప్‌డీల్‌ లాంటి సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే వీటిని వెనక్కినెట్టి ఫ్లిప్‌కార్డు దక్కించుకుంది. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ మింత్రాను విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. జబాంగ్‌తో మరింతగా విస్తరించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com