పురావస్తు శాస్త్రవేత్త పీవీ పరబ్రహ్మశాస్త్రి మృతి
- July 27, 2016
పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రకారుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఎన్నో చరిత్రలను బయటకు తీసి వందలాది శాసనాలను ప్రకటించిన గొప్ప చరిత్రకారునిగా పరబ్రహ్మశాస్త్రి నిలిచిపోయారని చంద్రబాబు అన్నారు. శాతవాహనులు, కాకతీయుల పాలనా విశేషాలు ప్రపంచానికి చాటి చరిత్రకు మేలు చేశారని సీఎం కొనియాడారు. పరబ్రహ్మశాస్త్రి పరమపదించడం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శాత వాహనుల వంశ చరిత్రపై పరిశోధనలు చేసి తెలుగువారని రుజువు చేసిన చరిత్రకారుడు పరబ్రహ్మ శాస్త్రి అని గుర్తు చేశారు. ఆయన మృతి తెలగు భాషకు, తెలుగు సాహిత్యానికి తీరని లోటని బాలకృష్ణ అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









