ఖతార్ లో 80% తగ్గిన స్కూల్స్ లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులు..!!
- January 04, 2026
దోహా: ఖతార్ లో స్కూల్స్ లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులు 80శాతం తగ్గనున్నాయి. ఇందు కోసం ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్ల కోసం అధునాతన లైసెన్సింగ్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ముఖ్యంగా మునుపటి వ్యవస్థతో పోలిస్తే లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులలో దాదాపు 80% తగ్గుతుందని విద్యామంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో విద్య మరియు ఉన్నత విద్యా మంత్రి హెచ్ ఇ లోల్వా బింట్ రషీద్ అల్ ఖాటర్ స్పష్టం చేశారు.
ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్లు ఇప్పుడు ఏటా కాకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తమ లైసెన్స్లను పునరుద్ధరిస్తాయని తెలిపారు. దీంతోపాటు మంత్రిత్వ శాఖ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న విశిష్ట పాఠశాలలకు ఐదు సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే అధునాతన విద్యా లైసెన్స్ మంజూరు చేయబడుతుందన్నారు.
ఈ వ్యవస్థ ప్రైవేట్ విద్యా సంస్థల లైసెన్సింగ్ ప్లాట్ఫామ్ ద్వారా పనిచేస్తుందని, ఇది అన్ని లైసెన్సింగ్ విధానాలను ఒకే డిజిటల్ ఇంటర్ఫేస్లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్ లు ఏర్పాటు
- ఖతార్లో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు..!!
- ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ లో స్పిన్నీస్, వెయిట్రోస్ లొకేషన్లలో పెయిడ్ పార్కింగ్..!!
- నాన్ కువైటీలకు రుణ నిబంధనలను సడలించిన బ్యాంకులు..!!
- గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- బహ్రెయిన్ లో యువత సామర్థ్యాలకు పదును..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్
- బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!







