బ్రెయిన్ డెడ్ బాలుడి కుటుంబానికి సీఎం చంద్రబాబు అభినందనలు

- January 04, 2026 , by Maagulf
బ్రెయిన్ డెడ్ బాలుడి కుటుంబానికి సీఎం చంద్రబాబు అభినందనలు

అమరావతి: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేసి, ఐదుగురికి ప్రాణం పోసిన కర్నూలు జిల్లాకు చెందిన కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు. ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని, సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.

ర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చెందిన 15 ఏళ్ల బాలుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు.ఈ విషాద సమయంలోనూ ఆ బాలుడి కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకొచ్చి అవయవదానానికి అంగీకరించారు. వారి నిర్ణయం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురికి కొత్త జీవితం లభించింది. ఈ గొప్ప త్యాగం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

ఇదే సమయంలో, తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయ వైద్యులను కూడా సీఎం అభినందించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక యువతికి విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసినందుకు వైద్య బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com