ఓటీటీలోకి కొత్త సినిమా దండోరా..
- January 10, 2026
నటుడు శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ దండోరా. పరువు హత్య, అగ్ర-బలహీన వర్గాల మధ్య ఆధిపత్యం లాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కించాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులను ఓమోస్తరులోనే ఆకట్టుకుంది.
డీసెంట్ కలక్షన్స్ కూడా రాబట్టింది. అయితే, అదే సీజన్ లో మరో మూడు సినిమాలు కూడా విడుదల కావడంతో ఆ పోటీని తట్టుకోవడంలో తడబడింది దండోరా(Dhandoraa OTT) మూవీ. తాజాగా, ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దండరా మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిదే.
ఈనేపథ్యంలోనే దండోరా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న స్ట్రీమింగ్ చూస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేసింది అమెజాన్ ప్రైమ్. దీంతో, దండోరా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్స్ లో ఈ సినిమాకు అనుకున్నంత ఆదరణ రాలేదు కాబట్టి, ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి, ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారు అనేది చూడాలి.
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







