ఓటీటీలోకి కొత్త సినిమా దండోరా..
- January 10, 2026
నటుడు శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ దండోరా. పరువు హత్య, అగ్ర-బలహీన వర్గాల మధ్య ఆధిపత్యం లాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కించాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులను ఓమోస్తరులోనే ఆకట్టుకుంది.
డీసెంట్ కలక్షన్స్ కూడా రాబట్టింది. అయితే, అదే సీజన్ లో మరో మూడు సినిమాలు కూడా విడుదల కావడంతో ఆ పోటీని తట్టుకోవడంలో తడబడింది దండోరా(Dhandoraa OTT) మూవీ. తాజాగా, ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దండరా మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిదే.
ఈనేపథ్యంలోనే దండోరా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న స్ట్రీమింగ్ చూస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేసింది అమెజాన్ ప్రైమ్. దీంతో, దండోరా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్స్ లో ఈ సినిమాకు అనుకున్నంత ఆదరణ రాలేదు కాబట్టి, ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి, ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారు అనేది చూడాలి.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







