ఓటీటీలోకి కొత్త సినిమా దండోరా..
- January 10, 2026
నటుడు శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ దండోరా. పరువు హత్య, అగ్ర-బలహీన వర్గాల మధ్య ఆధిపత్యం లాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కించాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులను ఓమోస్తరులోనే ఆకట్టుకుంది.
డీసెంట్ కలక్షన్స్ కూడా రాబట్టింది. అయితే, అదే సీజన్ లో మరో మూడు సినిమాలు కూడా విడుదల కావడంతో ఆ పోటీని తట్టుకోవడంలో తడబడింది దండోరా(Dhandoraa OTT) మూవీ. తాజాగా, ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దండరా మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిదే.
ఈనేపథ్యంలోనే దండోరా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న స్ట్రీమింగ్ చూస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేసింది అమెజాన్ ప్రైమ్. దీంతో, దండోరా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్స్ లో ఈ సినిమాకు అనుకున్నంత ఆదరణ రాలేదు కాబట్టి, ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి, ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారు అనేది చూడాలి.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









