'అతడు' 4K ఫిబ్రవరి 28న గ్రాండ్ గా రీ–రిలీజ్
- February 10, 2026
సూపర్స్టార్ మహేష్ బాబు ఐకానిక్ క్లాసిక్ 'అతడు' మరోసారి గ్రాండ్గా వెండి తెరపైకి రాబోతోంది. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసిన ఈ టైమ్లెస్ క్లాసిక్ ఫిబ్రవరి 28న 4K ఫార్మాట్లో థియేటర్లలో రీ–రిలీజ్ కానుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. వెటరన్ నటుడు–నిర్మాత మురళీ మోహన్ ప్రతిష్టాత్మకంగా జయభేరి ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించారు.
మహేష్ బాబు స్టైలిష్ పెర్ఫార్మెన్స్, తివిక్రమ్ మార్క్ డైలాగ్స్, క్లాస్ మేకింగ్, అద్భుతమైన పాటలు, మర్చిపోలేని యాక్షన్ తో అతడు కల్ట్ క్లాసిక్గా నిలిచింది.
ఇప్పుడు సూపర్ 4K లో, డాల్బీ ఆడియోతో మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
థియేటర్ లిస్ట్స్, బుకింగ్ డీటెయిల్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
ఈ ఐకానిక్ క్లాసిక్ని బిగ్ స్క్రీన్పై గ్రాండ్గా ఎక్సపీరియన్స్ చేయడానికి ఆడియన్స్… గెట్ రెడీ.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









