‘కేరళ స్టోరీ-2’ విడుదలకు గ్రీన్ సిగ్నల్
- February 27, 2026
బాలీవుడ్ నుంచి రాబోతున్న ‘ది కేరళ స్టోరీ 2 – గోస్ బియాండ్’ వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచిన సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.గతంలో సినిమా ప్రదర్శనపై ఉన్న అడ్డంకులను తొలగిస్తూ కేరళ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ఉన్న చట్టపరమైన చిక్కులు తొలిగిపోయాయి.
ఈ సినిమా విడుదలపై ఫిబ్రవరి 26న విధించిన 15 రోజుల స్టేను జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి మరియు జస్టిస్ పి.వి. బాలకృష్ణన్లతో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న కారణంతో జస్టిస్ బెచు కురియన్ థామస్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఫిబ్రవరి 26న సినిమాను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిపిన కోర్టు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) స్వభావం ఉన్న ఇలాంటి అంశాలను సింగిల్ బెంచ్ విచారించడం సరికాదని అభిప్రాయపడింది.వాక్ స్వాతంత్య్రం, కళాత్మక స్వేచ్ఛను గౌరవిస్తూ, సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









