బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!

- March 02, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!

మనామా: బహ్రెయిన్‌లోని అన్ని కోర్టు సెషన్లను మార్చి 5 వరకు నిలిపివేస్తున్నట్లు జస్టిస్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులు మరియు న్యాయవాదుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

కోర్టు సేషన్ల రీఓపెన్ గురించిన నిర్ణయం పరిస్థితులను బట్టి ఉంటుందని వెల్లడించింది.  రిఫాలోని సివిల్, క్రిమినల్ మరియు షరియా కోర్టు సెషన్‌లతో సహా అన్ని రకాల కేసులకు ఈ సస్పెండ్ ఉత్తర్వులు వర్తిస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com