సౌదీ లెయిడ్ ఆఫ్ వర్కర్స్కి భారత్ బాసట
- August 01, 2016
భారత విదేశాంగ శాఖ, సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయి, రోడ్డున పడ్డ భారతీయుల్ని ఆదుకుంటామని ప్రకటించింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించారు. రియాద్లోని ఇండియన్ ఎంబసీ, లెయిడ్ ఆఫ్ వర్కర్లకు ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తోందని చెప్పారామె. అలాగే, సౌదీ అరేబియాకి వెళ్ళి, అక్కడి నుంచి కార్మికుల్ని తిరిగి ఇండియాకి తీసుకొచ్చేందుకు వీలుగా మంత్రిత్వ శాఖ తరఫున అధికారుల్ని పంపుతున్నట్లు ఆమె వివరించారు. బాధిత ఉద్యోగులు, కార్మికులు ఎక్కువగా సౌదీలో నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. అంతర్జాతీయ సంక్షోభం కారణంగా సౌదీ అరేబియాలో కన్స్ట్రక్షన్ రంగం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఈ కారణంగా 10000 మందికి పైగా ఉద్యోగులు కార్మికులు రోడ్డున పడ్డారు. సౌదీలో వారి దీన పరిస్థితులపై సోషల్ మీడియా ద్వారా ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఈ విషయం మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్ళడంతో, మంత్రిత్వ శాఖ అప్రమత్తమయ్యింది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







