సౌదీ లెయిడ్ ఆఫ్ వర్కర్స్కి భారత్ బాసట
- August 01, 2016
భారత విదేశాంగ శాఖ, సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయి, రోడ్డున పడ్డ భారతీయుల్ని ఆదుకుంటామని ప్రకటించింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించారు. రియాద్లోని ఇండియన్ ఎంబసీ, లెయిడ్ ఆఫ్ వర్కర్లకు ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తోందని చెప్పారామె. అలాగే, సౌదీ అరేబియాకి వెళ్ళి, అక్కడి నుంచి కార్మికుల్ని తిరిగి ఇండియాకి తీసుకొచ్చేందుకు వీలుగా మంత్రిత్వ శాఖ తరఫున అధికారుల్ని పంపుతున్నట్లు ఆమె వివరించారు. బాధిత ఉద్యోగులు, కార్మికులు ఎక్కువగా సౌదీలో నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. అంతర్జాతీయ సంక్షోభం కారణంగా సౌదీ అరేబియాలో కన్స్ట్రక్షన్ రంగం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఈ కారణంగా 10000 మందికి పైగా ఉద్యోగులు కార్మికులు రోడ్డున పడ్డారు. సౌదీలో వారి దీన పరిస్థితులపై సోషల్ మీడియా ద్వారా ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఈ విషయం మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్ళడంతో, మంత్రిత్వ శాఖ అప్రమత్తమయ్యింది.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







