సౌదీ లెయిడ్ ఆఫ్ వర్కర్స్కి భారత్ బాసట
- August 01, 2016
భారత విదేశాంగ శాఖ, సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయి, రోడ్డున పడ్డ భారతీయుల్ని ఆదుకుంటామని ప్రకటించింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించారు. రియాద్లోని ఇండియన్ ఎంబసీ, లెయిడ్ ఆఫ్ వర్కర్లకు ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తోందని చెప్పారామె. అలాగే, సౌదీ అరేబియాకి వెళ్ళి, అక్కడి నుంచి కార్మికుల్ని తిరిగి ఇండియాకి తీసుకొచ్చేందుకు వీలుగా మంత్రిత్వ శాఖ తరఫున అధికారుల్ని పంపుతున్నట్లు ఆమె వివరించారు. బాధిత ఉద్యోగులు, కార్మికులు ఎక్కువగా సౌదీలో నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. అంతర్జాతీయ సంక్షోభం కారణంగా సౌదీ అరేబియాలో కన్స్ట్రక్షన్ రంగం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఈ కారణంగా 10000 మందికి పైగా ఉద్యోగులు కార్మికులు రోడ్డున పడ్డారు. సౌదీలో వారి దీన పరిస్థితులపై సోషల్ మీడియా ద్వారా ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఈ విషయం మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్ళడంతో, మంత్రిత్వ శాఖ అప్రమత్తమయ్యింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







