యోగా చేస్తున్నారా? ప్రత్యేక ఆహారం ట్రై చెయ్యండి

- July 22, 2015 , by Maagulf
యోగా చేస్తున్నారా? ప్రత్యేక ఆహారం ట్రై చెయ్యండి

ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఒక చక్కటి మార్గం. యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు మంచి శరీరసౌష్టవం కూడా మన సొంతమవుతుంది. మన శరీరాన్ని మనం ప్రేమించుకునేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఖచ్చితంగా ఒక భాగం కావాలి. అయితే యోగా చేసేవారు ఆహారం విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువ సమయం యోగా చేయడం వల్ల కండరాల నొప్పి బాధిస్తుంటుంది. దీన్ని అధిగమించలంటే రోజూ యోగా చేసి వచ్చిన తర్వాత ఒక అరటిపండును తప్పని సరిగా తీసుకోవాలి. అరటి పండులో పీచుపదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా శరీరానికి శక్తి అందుతుంది. దీనిలోని మెగ్నీషియం, సోడియంలు శరీరంలోని తేమ శాతాన్ని పెంచుతాయి. యోగా చేసేవారు ఖచ్చితంగా ఓట్స్‌ని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఓట్స్‌లోని మెగ్నీషియం, పొటాషియంలు కండరాల నొప్పిని తగ్గిస్తాయి. శరీరానికి తగిన పీచునీ అందిస్తాయి. మరొక అల్పాహారం బాదం. ముందురోజు రాత్రి కొన్ని బాదం పప్పులను నీటిలో వేసి నానబెట్టి మరునాటి ఉదయం యోగా చేసేముందు వాటిని తినడం వల్ల శరీరానికి అలసట ఉండదు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు,విటమిన్లూ శరీరానికి తక్షణ శక్తినందిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com