AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- April 01, 2026
రష్యా సైన్యానికి చెందిన ఏఎన్-26 రవాణా విమానం క్రిమియా ద్వీపకల్పంలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు సహా మొత్తం 29 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానం నేరుగా ఒక కొండను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 31న మాస్కో కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తున్న విమానంతో అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కొంతసేపటి తరువాత గాలింపు బృందం విమాన శకలాలను గుర్తించింది. అయితే అందులో ఉన్న వారిలో ఎవరూ బతికిలేరని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనతో రష్యా సైనిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. శత్రువుల దాడి జరిగిందనే కోణం లేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఏఎన్-26 తేలికపాటి సైనిక రవాణా విమానం. దీని ద్వారా తక్కువ, మధ్యస్థ దూరాలకు సరుకుతో పాటు సుమారు 40 మంది వరకు ప్రయాణికులను తరలించే సామర్థ్యం ఉంది.
గత సంవత్సరం డిసెంబర్ 2025లో కూడా రష్యాలో ఇలాంటి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతుల అనంతరం నిర్వహించిన పరీక్షా విమాన ప్రయాణం సమయంలో ఏఎన్-22 విమానం కుప్పకూలి ఏడుగురు సిబ్బంది మరణించారు. తాజా ఘటనతో రష్యా సైన్యంలో మరోసారి విషాదం నెలకొంది. ప్రమాదానికి అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!









