అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- April 20, 2026
అమెరికా: అమెరికాలోని లూసియానా రాష్ట్రం ష్రీవ్పోర్ట్ నగరంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక దుండగుడు తన సొంత పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది చిన్నారులను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘోర ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
నిందితుడు వెస్ట్ 79వ స్ట్రీట్లోని రెండు ఇళ్లపై, అలాగే హారిస్ స్ట్రీట్లోని మరో నివాసంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన చిన్నారులంతా ఒకటి నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారని పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటన అనంతరం నిందితుడు ఒక కారును దొంగిలించి (Mass shooting USA ) అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని వెంబడించి బోసియర్ సిటీ సమీపంలో ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా, అమెరికాలో గన్ నియంత్రణ చట్టాలపై మళ్లీ చర్చ మొదలైంది.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









