పుష్కరాల తరువాత మంత్రివర్గంలోకి లోకేష్

- August 08, 2016 , by Maagulf
పుష్కరాల తరువాత మంత్రివర్గంలోకి  లోకేష్

నారా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని తపిస్తోన్న టిడిపి నేతలకు శుభవార్త. అతిత్వరలోనే చినబాబు ప్రభుత్వంలో చేరే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా పుష్కరాలు ముగిసిన వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగబోతోందని సమాచారం. దీనిలో లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపి లోకి వచ్చిన కొందరు నేతలను కూడా మంత్రిపదవులు వరించే అవకాశం కనిపిస్తోంది. ఇంతకాలం లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలా వద్దా అన్న విషయమై అటు ఇటుగా ఆలోచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ వ్యవహారాలు చూస్తూవచ్చిన లోకేష్ ఇప్పుడు ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారన్నమాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com