పుష్కరాల తరువాత మంత్రివర్గంలోకి లోకేష్
- August 08, 2016
నారా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని తపిస్తోన్న టిడిపి నేతలకు శుభవార్త. అతిత్వరలోనే చినబాబు ప్రభుత్వంలో చేరే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా పుష్కరాలు ముగిసిన వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగబోతోందని సమాచారం. దీనిలో లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపి లోకి వచ్చిన కొందరు నేతలను కూడా మంత్రిపదవులు వరించే అవకాశం కనిపిస్తోంది. ఇంతకాలం లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలా వద్దా అన్న విషయమై అటు ఇటుగా ఆలోచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ వ్యవహారాలు చూస్తూవచ్చిన లోకేష్ ఇప్పుడు ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారన్నమాట.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









