బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- June 04, 2026
మనామా: బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తరపున క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు గుర్తించిన 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరు యువతను లక్ష్యంగా చేసుకుని, అనైక్యతను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. చట్టవిరుద్ధ సంస్థల అజెండాలను అమలు చేయడానికి సెల్స్ను ఏర్పాటు చేస్తూ, ఈ నెట్వర్క్ పనిచేసిందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం న్యాయపరమైన విచారణలు జరుగుతున్నాయని, అదే సమయంలో ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. జాతీయ భద్రత మరియు సామాజిక స్థిరత్వాన్ని పరిరక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. పౌర శాంతికి భంగం కలిగించడానికి లేదా బహ్రెయిన్ సమాజంలో విభజన సృష్టించడానికి ప్రయత్నించే ఎవరినైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









