ఆనందమే ఆరోగ్యం

- July 25, 2015 , by Maagulf
ఆనందమే ఆరోగ్యం


ఉదయం పూట మనం స్నాక్స్‌లాంటి పదార్ధాలు ఎన్ని తీసుకున్నా, మధ్యాహ్నం మాత్రం రైస్‌కి సంబంధించినవి ఆహారంగా తీసుకోపోతే కడుపు నిండినట్లు ఉండదు. శరీరానికి తగిన శక్తీ లభించదు. అయితే బియ్యానికి సమానంగా మనకు శక్తినిచ్చే పదార్ధాల్లో గోధుమలు కీలక పాత్ర వహిస్తాయి. వీటిని వరికి బదులుగా తీసుకున్నా పూర్తి శక్తిని పొందగలం. గోధుమల్లో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది మన శరీరంలోని బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ నిల్వలను తగ్గించి శరీరం నాజూగ్గా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. గోధుమల్లో మెగ్నీషియం, ఖనిజలవణాలు ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో గోధుమ ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి కంట్రోల్‌లో ఉంటుంది. గోధుమలతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ వ్యవస్థ సక్రమంగా పని చేయడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండడానికి తోడ్పడుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com