ఢాకాలో మాజీ ఎంపీకి ఉరిశిక్ష ఖరారు
- August 10, 2016
స్వాతంత్య్రోద్యమ కాలంలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు గాను జమాతే ఇస్లామీ పార్టీ నేత, మాజీ ఎంపీ షెకావత్ హుస్సేన్(68)కు బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రెబ్యునుల్ బుధవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. షెకావత్ హుస్సేన్ యుద్ధ నేరాలపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆయన్ను దోషిగా తేల్చింది. షెకావత్ తో పాటు కేసుతో సంబంధమున్న మరికొందరు నిందితులకు జీవిత ఖైదు విధించింది ట్రైబ్యునల్.
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్లోనే అతిపెద్ద ముస్లిం పార్టీగా జమాతే ఇస్లామీ గుర్తింపు ఉంది. కాగా, 1971లో జరిగిన స్వాతంత్ర్య సంగ్రామంలో జమాతే ఇస్లామీ నేతలు బంగ్లాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ కు సహకరించారనే అభియోగాలున్నాయి.
ఈ వ్యవహారంలో షెకావత్ కూడా కీలక పాత్ర పోషించారని రుజువు కావడంతో.. ఆయనకు ఉరిశిక్ష తప్పలేదు. అయితే ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు షెకావత్ తరపు న్యాయవాది ప్రకటించారు. ఇవే అభియోగాలపై ఈమధ్య కాలంలో బంగ్లాదేశ్ పలువురిని ఉరి తీసింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









