చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- July 19, 2026
కువైట్ సిటీ: కువైట్ ఫుడ్ మరియు న్యూట్రిషియన్ అథారిటీ (PAFN) అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో చేపల మార్కెట్లో నిర్వహించిన తనిఖీల్లో 3.2 టన్నులకు పైగా వినియోగానికి అనర్హమైన చేపలను స్వాధీనం చేసుకుంది. తనిఖీల సందర్భంగా మొత్తం 3 టన్నులు 237 కిలోల చేపలు కుళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. వాటి సహజ రంగు, ఆకారం, వాసన పూర్తిగా మారిపోవడంతో పాటు దుర్వాసన వస్తున్నట్లు వెల్లడించారు. ఈ చేపలను వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు బాధ్యులపై ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు పీఏఎఫ్ఎన్ వెల్లడించింది. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా స్వాధీనం చేసుకున్న చేపలను నిబంధనల ప్రకారం పూర్తిగా ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల విక్రయంపై ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!







