కిడ్నాప్ చేసిన 2 సంవత్సరాల తర్వాత వీడియో రిలీజ్ చేసిన తీవ్రవాదులు
- August 14, 2016
ఉగ్రవాదుల బెడద ఏ ఒక్క దేశానికో పరిమితం కావడం లేదు. ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాద బాధిత దేశాలే. వివిధ సంస్థల పేర్లతో బయటకు వస్తున్న ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. ఇక ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా విషయానికొస్తే బోకో హరామ్ తీవ్రవాదులు ఆ దేశాన్ని గడగడలాడిస్తున్నారు. ఏప్రిల్ 2014 లో ఓ స్కూలు నుంచి చిబోకి బాలికలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఉగ్రవాదులు సరిగ్గా 852 రోజుల తర్వాత ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బాలికలను తిరిగి క్షేమంగా అప్పగించాలంటే ప్రభుత్వం చెరలో ఉన్న తమ వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు 50 మంది వరకు అమ్మాయిలు హిజాబ్లు ధరించి వీడియోలో కనిపిస్తున్నారు. ఓ ఉగ్రవాది వారితో సైతం మాట్లాడించాడు. ఈ సందర్భంగా ఓ బాలిక మాట్లాడుతూ నైజీరియన్ ఎయిర్ఫోర్స్ దాడుల్లో తమతోపాటు కిడ్నాపైన వారిలో డజన్ల కొద్దీ అమ్మాయిలు కళ్లముందే ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పింది. అంతేకాదు వాయుదాడుల్లో మరణించిన అమ్మాయిలను కూడా వీడియోలో చూపించారు. ఈ బాలికలను విడిచిపెట్టాలంటే తక్షణమే పోలీసుల చెరలో ఉన్న తమ వారిని విడిచిపెట్టాలని అధ్యక్షుడు ముహమ్మదు బుహారి నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వాన్ని బోకోహరామ్ తీవ్రవాదులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









