వీధుల్లో వేధింపులపై అల్ ఖువాయిర్ నివాసితుల ఫిర్యాదు
- August 15, 2016
32 ఏళ్ళ మహిళ ఒంటరిగా వెళుతున్న సమయంలో ఆమెను కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారు. వాహనాల్లో నెమ్మదిగా వస్తూ, 'రేటెంత' అని అడుగుతుండడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు అల్ ఖువాయిర్ ప్రాంతంలో నిత్యకృత్యమైపోయాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 14 నుంచి 15 ఏళ్ళలోపు యువకులు ఎక్కువగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు వాపోతున్నారు. రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు తనిఖీలు నిర్వహిస్తున్నా, చాలా సందర్భాల్లో యువత తప్పించుకుంటున్నారనీ, 14 నుంచి 15 ఏళ్ళ లోపు వారే కావడంతో వారి పట్ల ఎవరికీ అనుమానం రావడంలేదని బాధితులు వాపోయారు. పోలీసులకు ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









