ఒమాన్లో కార్మికుల కస్టాలు... రెండు రోజులు నడిచి రాయబార కార్యాలయానికి
- August 17, 2016
ఒమాన్ : బతుకు తెరువు కోసం భారతదేశం నుంచి ఒమాన్ కు వచ్చిన కొందరు భవన నిర్మాణ కార్మికులు నానా బాధలు పడుతున్నారు, వీరంతా పని చేయడానికి ఇక్కడకు వచ్చి మోసపోయిన 14 మంది తెలంగాణ కార్మికులు ఎట్టకేలకు స్వరాష్ట్రానికి పయనమయ్యారు. ఆదిలాబాద్,కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన వీరు ఒమాన్లోని జబల్అల్ అఖ్దర్ అనే ప్రాంతం సమీపంలో కొండలు,నదుల మధ్య రెండు రోజులు నడిచి తర్వాత ట్రక్కులో 150 కిలోమీటర్ల దూరంలోని రాజధాని మస్కట్లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. తమను ఆదుకోవాలంటూ వారు అధికారులకు చేసిన విజ్ఞప్తికి దౌత్యఅధికారులు చలించిపోయి వారిని స్వదేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
భవననిర్మాణ కార్మికులుగా పనిచేసేందుకు వీరంతా ఆరు నెలల క్రితం గల్ఫ్కు వచ్చారు. ముంబైలోని వర్లిలో ఉండే కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక ఏజెంటుకు డబ్బు చెల్లించిన తాము కొండలపై ఆటవిక జీవనశైలీలో నివాసం ఉంటున్నామని బాధితులు తమ గోడు వెళ్ళబోసుకొన్నారు. ఒక పాఠశాల భవన నిర్మాణంలో కొంతకాలం పనిచేశాక ఒక నెల జీతం చెల్లించి, మిగిలిన కాలానికి జీతం చెల్లించకపోవడంతో పని లేక చేతులో డబ్బులు లేక, అనేక ఇబ్బందులతో స్వరాషా్ట్రనికి తిరిగి వెళ్తున్నట్లుగా వారు వివరించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







