దీపాను ఖేల్రత్న పురస్కారానికి ఎంపిక?
- August 17, 2016
2016 ఒలింపిక్స్లో తనదైన ప్రదర్శనతో భారతీయుల హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్కు అరుదైన పురస్కారం ఇవ్వాలని కేంద్రం భావిస్తోందట. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల దీపాను ఖేల్రత్న పురస్కారానికి ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఒలింపిక్స్లో పతకం చేజారినా ఆమె చేసిన విన్యాసాలు కోట్లాది మంది భారతీయులను ఆకట్టుకున్నాయి. ఈ విషయంలో ఆమెకు అవార్డ్ ఇవ్వాల్సిందేనంటూ చాలామంది క్రీడాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డ్ని ఇవ్వనున్నారు. అదే విధంగా దీప కోచ్ బిశ్వేశ్వర్కు ద్రోణాచార్య ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరోపక్క రియోలో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎనిమిదో స్థానంలో నిలిచిన షూటర్ జితూరాయ్కు కూడా ఖేల్రత్న ఇవ్వనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







