దీపాను ఖేల్రత్న పురస్కారానికి ఎంపిక?
- August 17, 2016
2016 ఒలింపిక్స్లో తనదైన ప్రదర్శనతో భారతీయుల హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్కు అరుదైన పురస్కారం ఇవ్వాలని కేంద్రం భావిస్తోందట. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల దీపాను ఖేల్రత్న పురస్కారానికి ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఒలింపిక్స్లో పతకం చేజారినా ఆమె చేసిన విన్యాసాలు కోట్లాది మంది భారతీయులను ఆకట్టుకున్నాయి. ఈ విషయంలో ఆమెకు అవార్డ్ ఇవ్వాల్సిందేనంటూ చాలామంది క్రీడాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డ్ని ఇవ్వనున్నారు. అదే విధంగా దీప కోచ్ బిశ్వేశ్వర్కు ద్రోణాచార్య ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరోపక్క రియోలో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎనిమిదో స్థానంలో నిలిచిన షూటర్ జితూరాయ్కు కూడా ఖేల్రత్న ఇవ్వనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









