స్టోర్ పాలెస్ ప్రారంభించిన మోదీ ...
- August 22, 2016
పొరుగు దేశమైన అఫ్గానిస్థాన్కు భారతీయుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేడు అఫ్గాన్ రాజధాని కాబుల్లో పునరుద్ధరించిన స్టోర్ పాలెస్ను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కాబుల్లో ఉన్న అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో కలిసి మోదీ ఈ పాలెస్ ప్రారంభోత్సవం చేశారు. అఫ్గానిస్థాన్తో మంచి స్నేహం ఉందని, ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. బయటి శక్తుల కారణంగా అఫ్గాన్లో కొనసాగుతున్న హింస బాధపెడుతోందని మోదీ అన్నారు. దేశంలో శాంతి భధ్రతలు, అభివృద్ధి పెంపొందడంతో పాటు సంపన్న దేశంగా మారాలని, అఫ్గాన్ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.శాంతి ఉగ్రవాదాన్ని, హింసను జయిస్తుందని.. భారత్, అఫ్గాన్ ఎప్పటికీ మంచి మిత్రులుగా ఉండాలని అఫ్గాన్ అధ్యక్షుడు ఘని అన్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









