అక్రమ నివాసితులు కతర్ వదిలివెళ్లిపోవడానికి రాయబార కార్యాలయాలు సహాయం
- August 26, 2016
కనీసం మూడు దక్షిణ ఆసియాదేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు వారి దేశాలకు చెందిన బహిష్కృతులు అధికారిక నివాస అనుమతి లేకుండా కతర్ లో ఎక్కువకాలం నివసించకుండా ఉండేందుకు మూడు నెలల పాటు సడలింపు అవకాశమిస్తున్నారు. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ఇది మొదలవుతుందని అంతర్గత యొక్క (ఎం ఓ ఎల్) మంత్రిత్వశాఖ బుధవారం ఒక పేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. 2009 చట్టం 4 వ సంఖ్యలో విదేశీయులు దేశంలో ప్రవేశం, బైటకు వెళ్లడం , నివాసం మరియు ప్రాయోజితుల యొక్క క్రమబద్ధీకరణ యొక్క నిబంధనల విషయంలో విదేశీయులు ఉల్లంఘన జరిపినట్లయితే, దేశంలో నివసిస్తున్న సమయంలో ఏ చట్టపరమైన పరిణామాలు లేకుండా వారు దేశం నుంచి స్వచ్ఛంగా నిష్క్రమించేలా మూడు నెలలపాటు అమలవుతుంది. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి డిసెంబర్ 1 వ తేదీ2016 వరకు ఈ సడలింపు కొనసాగవుతుందని తెలిపింది.
12 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత విరామం తర్వాత క్షమాభిక్ష అవకాశం అంతర్గత యొక్క (ఎం ఓ ఎల్) మంత్రిత్వశాఖ కల్పిస్తుంది. 2004 సంవత్సరంలో మార్చి నుంచి జూలై మధ్య కాలంలో ఉండటం గమనార్హం. కతర్ లో అక్రమ నివాసితుల గూర్చి సంప్రదించగా శ్రీలంక, నేపాల్ మరియు బంగ్లాదేశ్ అధికారులు తమ దేశస్థులకు క్షమాభిక్ష పథకం అమలుచేయమని అభ్యర్ధించింది, ఆ తర్వాత అక్రమంగా అత్యధిక కాలం నుండి ఉన్న తమ జాతీయులను ఖతార్ వదిలి వెళ్లేలా చర్యలు రాబోయే రోజుల్లో తీసుకొంటామని రాయబార కార్యాలయాల అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







