ప్రాణ స్నేహితుల కలయిక
- September 03, 2016
ఎప్పుడూ బిజీగా ఉండే చిరకాల స్నేహితులు ఒకింత తీరిక సుకుని...ఒకరినొకరు కలుసుకుంటే అది వారి జీవితాల్లో తీపిగుర్తులా మిగిలిపోతుంది. 'స్నేహబంధమూ ఎంత మధురమూ' అంటూ ఆప్యాయాతానురాగాలు కురిపించుకుంటాయి. మొదట ఆనందంతో మాటలు కరువైనా...ఆ తరువాత గత స్మృతులను నెమరువేసుకుంటూ తమదైన ప్రపంచంలో సర్వం మరిచిపోతారు. అలాంటి అనుభూతులనే 'పెదరాయుడు' మోహన్బాబు, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ పంచుకున్నారు. శనివారంనాడు చెన్నైలో తన మిత్రుడు రజనీకాంత్ను మోహన్బాబు కలుసుకుని విలువైన సమయాన్ని గడిపారు. ఆ అనుభూతులను ట్విటర్ ద్వారా మోహన్బాబు పంచుకున్నారు. 'చాలాకాలం తర్వాత నా మిత్రుడు రజనీకాంత్ను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
ఆయన కింగ్లా ఉన్నారు. ఈ కలియుగంలో ఆయన దుర్యోధనుడయితే నేను కర్ణుడిని' అని మోహన్బాబు ఆ ట్వీట్లో తమ అనుబంధాన్ని చాటుకున్నారు. తామిద్దరూ కలుసుకున్న ఫోటోతో పాటు రజనీకాంత్ సతీమణి లత తన చేతికి రాఖీ కడుతున్న ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. 'చాలాకాలం తర్వాత నా సోదరి లతను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.
రజనీకాంత్ విజయం వెనుక ఆయన సతీమణి లత ఉందని నేను బలంగా నమ్ముతున్నాను' అంటూ రజనీదంపతులపై ఆప్యాయతానురాగాలు కురిపించారు కలెక్షన్ కింగ్.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







