యు.ఏ.ఈ లో తీవ్రవాద ఆరోపణలపై 41 మంది విచారణ

- August 03, 2015 , by Maagulf
యు.ఏ.ఈ లో తీవ్రవాద ఆరోపణలపై 41 మంది విచారణ

యు.ఏ.ఈ లో  వివిధ దేశాలకు చెందిన 41 మంది వ్యక్తులను తీవ్రవాద ఆరోపణలపై విచారణ చేపట్టారు.ఈ గల్ఫ్ రాజ్యంలో, తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పాలనను స్థాపించేందుకు సాయుధ శిక్షణా శిబిరాలను నెలకొల్పి, ప్రేలుడు పదార్ధాలను తయారుచేసి, ప్రభుత్వాన్ని పదదోసే కుట్రచేస్తున్నారని వారిపై ఆరోపణలు వచ్చాయి.వీరికి విదేశీ తీవ్రవాద సంస్థలలో కూడా సంబంధాలున్నట్టు న్యాయాధికారులు తెలియజేశారు. ఇటీవలి సంవత్సరాలలో, తీవ్రవాద నేరాలపై సామూహికంగా విచారణలు చేపట్టడం ఇది రెండవసారి.


--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com