సౌదీలో తాజ్ ఆధ్వర్యంలో 'తెలుగు భాషా దినోత్సవ' వేడుకలు

- September 04, 2016 , by Maagulf

సౌదీ అరేబియా లోని జెడ్డా  నగరంలోని జెడ్డా తెలుగు సంఘం వారు ఎడారి ప్రాంతమైన గల్ఫ్ దేశాలలో మొట్ట మొదటిగా  "తెలుగు భాష దినోత్సవ " వేడుకలు జరిపి మన తెలుగు భాషా ప్రాముఖ్యతని చాటి చెప్పారు.
 ప్రపంచం లోని ఇతర  తెలుగు సంఘాలకు ధీటుగా జెడ్డా తెలుగు సంఘం వారు తెలుగు యొక్క ప్రాముఖ్యాన్ని ,గొప్పతనాన్ని , ఔనత్యాన్ని చాటి చెప్పారు . 
  సౌదీ అరేబియా లోని  జెడ్డా ,యాంబు, అల్ లిత్ ,రబీగ్  నగరాలలో నివసిస్తున్నటువంటి  తెలుగు  భాష ప్రేమికులైన మన రెండు రాష్ట్రాల  ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 
గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా జరిగిన తెలుగు భాష దినోత్సవంలో కార్యక్రమానికి విచ్చేసిన అందరిని  ఆహ్వానించిన విధానము, ప్రారంభ ఉపన్యాసము తెలుగు వారి అందరికి ఆప్యాయతని అందిచాయి .
 సుమారు 2400 సంవత్సరాల ప్రాచీనత కలిగిన తెలుగు భాష చరిత్రని, తెలుగు భాషకి  సంబంధించిన  కవుల గురించిన విషయాలను, ప్రాచీన దశనుంచి ఆధునిక యుగము వరకు భాష పరిణామక్రమమునకు చెందిన తెలుగు సాహిత్య ప్రదర్శన తెలుగు వారిని అమితముగా ఆకట్టుకున్నది .
 అద్భుతముగా సాగిన ఈ కార్యక్రమము లో  సాంస్కృతిక కార్యక్రమాలైన  ఖురాను ని ఉర్దూ మరియు తెలుగు లో చెప్పుట , తెలుగు తల్లి పాట , మా తెలుగు తల్లి చిన్న పిల్లల నృత్య ప్రదర్శన , మృదంగమము ,అద్భుతమైన రెండు క్లాసికల్ పాటలు , తెలుగు జానపద నృత్యం మరియు తెలుగుకూచిపూడి నృత్యం  ,తెలుగు ప్రత్యేక పాట , క్లాసికల్ సాంగ్ , తెలుగు జాతి మనది చిన్న పిల్లల కార్యక్రమము,తెలుగు కవిత్వము,చిన్నపిల్లలతెలుగు పద్యాలు ,ONCE MORE అనిపించిన పాటలు మరియు చివరి లో తెలుగు భాష గొప్పతనం  పాట  అందరిని అలరించాయి.
 
TAJ అధ్యక్షులు శ్రీ యూసుఫ్ అలీ గారు తమ ప్రసంగం లో  లక్ష మంది పైగా తెలుగు వారు ఈ పశ్చిమ సౌదీ లోవృత్తి రీత్యా స్థిర పడ్డారని  
తెలుగు వారి కి అండగా ఉండాలనే ఉద్దేశ్యం తో తెలుగు సంఘ స్థాపన జరిగిందని వివరించారు,
తెలుగు వారు మంచి హోదా లో ఉన్నారని , తోటి తెలుగు వారికీ సహాయం చేసేందు ముందుండాలని కోరారు,కుల మాత జాతి భేదాలను మర్చి మన మంతా తెలుగు వారమని పరస్పర సహాయ సహకారాలు అందించ్చు కోవాలని , మనమంతా బతుకు దెరువు కోసం ఇక్కడి కి వచ్చామని, మనం ముందు భారతీయులం ,ఆ తర్వాత తెలుగు వాళ్ళం, ప్రేమించి ఆదరించడం మన సంస్కృతి అని మనం ఎప్పుడు మన సంస్కృతి ని మరవొద్దని సూచించారు తెలుగు భాష పై ఉన్న మమకారం తో భాష దినోత్సవ కార్య క్రమంలో పాల్గొన్న తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
 
తెలుగు భాష కోసం సేవ చేసిన sayeeduddin గారిని మరియు శ్రీ ఇర్ఫాన్ గారుల తో పాటు . తెలుగు సంఘ ప్రతినిధులుగా  తెలుగు వారిని సమైక్య పరిచేందుకు కృషి చేస్తున్న కిరణ్ (యంబు). షబ్బీర్  (అల్  లిత్) ,వైకుంఠరావు (రబీగ్) కూడా సత్కరించారు 
ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా   విచ్చేసిన sayeeduddin  శ్రీ ఇర్ఫాన్ గారు  మరియు అతిధులుగా విచ్చేసిన INDIAN forum అధ్యక్షులు  శ్రీ  అజాజ్ గారు, మరియు తమిళ సంఘం అధ్యక్షులు  శ్రీ సిరాజ్ గారు మరియు షమీమ్ కౌసర్ గారు   తెలుగు భాష  గొప్పతనాన్నికొనియాడారు.దూర ప్రాంత  ల  నుంచి వచ్చ్హిన  కిరణ్ (యంబు) ,షబ్బీర్  (అల్  లిత్) ,వైకుంఠరావు (రబీగ్) కూడా ప్రసంగిచారు , తెలుగు సంఘం తెలుగు వారిని కలిపేందుకు ఒక వారధి లాగ పని చేస్తుందని అది ఎంతో అభి నంద నీయమైన విషయమని అన్నారు.  
 వహీద్ గారి గాన లహరి తో పాటు , శ్రీ లక్ష్మి, విజయ లక్ష్మి గారు తెలుగు పాటలు ఎంతో ప్రశింశ బడ్డాయి. వీరంతా తెలుగు పాటలతో అలరించారు.
కార్య క్రమ నిర్వాహక భాద్యులు శ్రీ నానాజీ, భాస్కర్ ,జానీ గారితో పాటు కార్యవర్గ సభ్యులైన  ,సాగర్, మొయిజ్, కారమతుల్లా  , ,మస్తాన్ , అప్పారావు మరియు LV రావు గార్లు  తెలుగు అతిథులందరికి చురుగ్గా సేవలందించడం అందరిని ముగ్దుల్ని చేసింది.
 
కార్యక్రమములో అందరు దేశ భాషలందు తెలుగు లెస్స అని నినదించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com