భారత్ దేశంపై కుబేరుల పట్టు
- September 04, 2016
అత్యధిక ఆర్థిక అసమానతలు ఉన్న రెండో దేశంగా భారత్ నిలిచింది. మరోవైపు భారత్లో అత్యధిక సంపద కేవలం మిలియనీర్ల వద్ద మూలుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. మిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వారి వద్దే దేశంలోని 54శాతం సొమ్ము మూలుగుతోందని న్యూవరల్డ్ వెల్త్ సంస్థ నిర్వహించిన సర్వేలో పేర్కొన్నారు. ఇక అత్యధిక వ్యకిగత సంపదలు ఉన్న దేశాల జాబితాలో భారత్ టాప్టెన్లో స్థానం దక్కించుకుంది.
ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో రష్యా మొదటి స్థానంలో నిలిచింది. ఆదేశంలో 62శాతం సంపద కుబేరుల వద్దే పోగుపడింది. దేశంలోని సంపన్నులు, వారు అదుపుచేసే సంపద నిష్పత్తిని బట్టి దీనిని అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత సమానమైన దేశంగా జపాన్ నిలిచింది. ఇక్కడ కేవలం 22శాతం సంపదను మాత్రమే సంపన్నులు అదుపు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా కేవలం 28శాతం సంపదను మాత్రమే సంపన్నులు శాసిస్తున్నారు. ఇటువంటి సమాజంలో బలమైన మధ్యతరగతి వర్గాలకు అవకాశం ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక పెద్దన్న అమెరికాలో 32శాతం సంపదను సంపన్నులు గుప్పిట్లో పెట్టుకున్నారు. యూకేలో కొంచెం ఎక్కువగా 35శాతం సంపదను గుప్పిట్లో పెట్టుకున్నారు.
ఇక బిలియనీర్లను లెక్కలోకి తీసుకుంటే రష్యాలోనే అత్యధికంగా 26శాతం సంపద వారి వద్ద ఉంది. జపాన్లో అత్యల్పంగా 3శాతం మాత్రమే వారిచెప్పుచేతుల్లో ఉంది. ఆస్తులు, నగదు, వాటాలు, వ్యాపారాలు, వంటివి లెక్కలోకి తీసుకొని ఈ సర్వేను నిర్వహించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







