భారత్ దేశంపై కుబేరుల పట్టు
- September 04, 2016
అత్యధిక ఆర్థిక అసమానతలు ఉన్న రెండో దేశంగా భారత్ నిలిచింది. మరోవైపు భారత్లో అత్యధిక సంపద కేవలం మిలియనీర్ల వద్ద మూలుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. మిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వారి వద్దే దేశంలోని 54శాతం సొమ్ము మూలుగుతోందని న్యూవరల్డ్ వెల్త్ సంస్థ నిర్వహించిన సర్వేలో పేర్కొన్నారు. ఇక అత్యధిక వ్యకిగత సంపదలు ఉన్న దేశాల జాబితాలో భారత్ టాప్టెన్లో స్థానం దక్కించుకుంది.
ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో రష్యా మొదటి స్థానంలో నిలిచింది. ఆదేశంలో 62శాతం సంపద కుబేరుల వద్దే పోగుపడింది. దేశంలోని సంపన్నులు, వారు అదుపుచేసే సంపద నిష్పత్తిని బట్టి దీనిని అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత సమానమైన దేశంగా జపాన్ నిలిచింది. ఇక్కడ కేవలం 22శాతం సంపదను మాత్రమే సంపన్నులు అదుపు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా కేవలం 28శాతం సంపదను మాత్రమే సంపన్నులు శాసిస్తున్నారు. ఇటువంటి సమాజంలో బలమైన మధ్యతరగతి వర్గాలకు అవకాశం ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక పెద్దన్న అమెరికాలో 32శాతం సంపదను సంపన్నులు గుప్పిట్లో పెట్టుకున్నారు. యూకేలో కొంచెం ఎక్కువగా 35శాతం సంపదను గుప్పిట్లో పెట్టుకున్నారు.
ఇక బిలియనీర్లను లెక్కలోకి తీసుకుంటే రష్యాలోనే అత్యధికంగా 26శాతం సంపద వారి వద్ద ఉంది. జపాన్లో అత్యల్పంగా 3శాతం మాత్రమే వారిచెప్పుచేతుల్లో ఉంది. ఆస్తులు, నగదు, వాటాలు, వ్యాపారాలు, వంటివి లెక్కలోకి తీసుకొని ఈ సర్వేను నిర్వహించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం







