పది 'ఆసియాన్' దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశం కానున్న మోదీ
- September 06, 2016
భారత ప్రధాని మోదీ బుధవారం లావోస్ రాజధాని వియంటియాన్లో పది 'ఆసియాన్' దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశం కానున్నారు. ఆసియాన్-భారత్ 14వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా సముద్రతల భద్రత, ఉగ్రవాదం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సహకారంపై చర్చించనున్నారు. మంగళవారం మొదలైన ఆసియాన్ దేశాల సదస్సులో భాగంగా బుధవారం ఆసియాన్ భారత్ శిఖరాగ్ర సమావేశం, గురువారం తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం జరుగుతాయి. ఈ రెండింటిలోనూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆసియాన్-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాన్ని 2015లో ప్రకటించినప్పటి నుంచి ఆ దేశాలతో భారత్ వాణిజ్య బంధం మరింత బలపడింది.మన వాణిజ్యంలో 12 శాతం ఈ పది దేశాలతోనే ఉంది. గురువారం తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పది ఆసియాన్ దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా, రష్యా పాల్గొంటాయి. 2005లో తూర్పు ఆసియా శిఖరాగ్ర వేదిక ఏర్పాటు చేసినప్పటి నుంచీ భారత్ అందులో సభ్యురాలిగా ఉంది. దక్షిణ చైనా సముద్రం మీద చైనా దుందుడుకు చర్యలపై ఆసియాన్ దేశాలు అభ్యంతరం చెబుతున్న తరుణంలో తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ఆయా పక్షాలు అనుసరించే వైఖరి ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









