టీవీ సిరీస్గా బ్రూస్లీ రాసిన కథ
- September 07, 2016
బ్రూస్లీ పేరు తెలియని వారుండరు. 1940లో జన్మించిన బ్రూస్లీ 'ది బిగ్ బాస్'.. 'ఎంటర్ ది డ్రాగన్' వంటి సినిమాలు.. కొన్ని టీవీషోలు చేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. 32ఏళ్ల వయస్సులోనే అనారోగ్యానికి గురై మరణించాడు. అయితే ఆయన చనిపోయిన 46ఏళ్ల తర్వాత ఇప్పుడు బ్రూస్లీ రాసిన కథను బుల్లితెర పైకి తీసుకొచ్చేందుకు ఆయన కూతురు ప్రయత్నిస్తోంది.బ్రూస్లీ నటించడంతో పాటు.. ఒక సినిమాకు స్క్రిప్టు రాశాడు. 'ది సైలెంట్ ఫ్లూట్' పేరుతో సినిమా చేద్దామనుకున్నాడు. కానీ.. ఆయన చనిపోయిన ఐదేళ్ల తర్వాత దాన్ని 'సర్కిల్ ఆఫ్ ఐరన్' పేరుతో మరొకరు తీసి విడుదల చేశారు.బ్రూస్లీ బతికి ఉన్నప్పుడు 'వారియర్' పేరుతో మరో కథను రాశారు. కానీ అది అప్పుడు కార్యరూపం దాల్చకుండానే బ్రూస్లీ మరణించాడు. అయితే చాలా కాలం తర్వాత బ్రూస్లీ కూతురు షాన్నన్ లీకి ఆ కథ దొరికింది. దీంతో తాజాగా ఆ కథను బుల్లితెరపై టీవీ సిరీస్గా మలిచేందుకు ప్రయత్నిస్తోంది.ఈ కథ మొత్తం మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అయిన ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంటుందట. దీన్ని బ్రూస్లీ జన్మించిన శాన్ఫ్రాన్సిస్స్కోలోని చైనాటౌన్లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









