ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఆవిష్కరించిన ఆపిల్ సంస్థ..
- September 07, 2016
ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయిన ఐఫోన్ సెవెన్, 7 ప్లస్ మొబైల్ మోడల్స్ ను ఆపిల్ సంస్థ ఆవిష్కరించింది. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇతర ప్రముఖులు ఈ లేటెస్ట్ మొబైల్స్ ను ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో సెకండ్ జనరేషన్ స్మార్ట్ వాచ్ను కూడా విడుదల చేశారు. 32 జీబీ వెర్షన్ ఉన్న ఐఫోన్ 7 ప్రారంభ ధర 649 డాలర్లు ఉండగా.. ఐఫోన్ 7 ప్లస్ రేటు 769 డాలర్లుగా కంపెనీ ప్రకటించింది. 128, 256 జీబీ వెర్షన్లలోనూ ఈ మొబైల్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్ సెవెన్ కు 4.7 అంగుళాల రెటీనా హెచ్డీ డిస్ప్లే స్క్రీన్ ఉండగా.. వెనుక భాగంలో 12 మెగా పిక్సల్స్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అదే ఐఫోన్ 7 ప్లస్ లో 5.5 అంగుళాల రెటీనా హెచ్డీ డిస్ప్లే స్క్రీన్ సహా... ఇంత వరకూ ఏ ఫోన్లోనూ లేని విధంగా యాపిల్ ఐఫోన్ 7 ప్లస్కు కెమెరా పరంగా సరికొత్త హంగులు అద్దింది. సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో 7 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ హెచ్డీ కెమెరా సైతం ఉంది.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









