పైరసీ సమస్య ఇండస్ట్రీలకు ప్రధాన శత్రువు : సిద్ధార్థ్
- September 08, 2016
భారత్ లో అన్ని సినీ ఇండస్ట్రీలను ఒకే సమస్య పట్టి పీడిస్తుందని టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ అంటున్నాడు. సినీ ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూనే తగిన సూచనలు ఇచ్చాడు. పైరసీ సమస్య ఇండస్ట్రీలకు ప్రధాన శత్రువు అని, దాంతో పాటు అసంబద్దమైన సినిమా విశ్లేషణ(రివ్యూ)లు సినిమాలను మార్కెట్ పరంగా దారుణంగా దెబ్బతీస్తున్నాయని వరుస ట్వీట్లు చేశాడు. సినిమా చేయాలంటేనే ఆసక్తి రావడం లేదని, వాటిపై గౌరవం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.సినిమా చూసిన వాళ్లు సాధ్యమైనంత త్వరగా విమర్శించడం జరుగుతుంటుందని, అలాంటివి కామన్ అయ్యాయని పేర్కొన్నాడు. కానీ, సినిమా చూస్తూనే లైవ్ ట్వీట్లు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రేక్షకులను సిద్ధార్థ్ ప్రశ్నించాడు.వాస్తవానికి మూవీ చూస్తూ ట్వీట్ చేస్తుంటే.. మీరు ఫోన్ ను చూస్తారా.. లేక తెరపై మూవీ చూస్తారా.. ఇలా ఒకేసారి బ్రెయిన్ రెండు పనులు చేయడం సాధ్యం కాదంటున్నాడు. హాల్లో ఉన్నప్పుడు మూవీ చూడటం కరెక్టా..? లేకపోతే స్టుపిడ్ ఫోన్ పై మనసు పెట్టాలా అనేది మీరు నిర్ణయించుకోవాలని హీరో సిద్ధార్థ తన అసహనాన్ని వెల్లగక్కాడు. ఫోన్లలో మూవీలు చూస్తే ఏదో రూపంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సూచించాడు.
తాజా వార్తలు
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!









