అమెరికా అధ్యక్షుడుతో మోదీ భేటీ

- September 08, 2016 , by Maagulf
అమెరికా అధ్యక్షుడుతో మోదీ భేటీ

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఇరు దేశాధినేతలు.. లావోస్‌ రాజధాని వియంటియానెలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, భాగస్వామ్యంపై వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గత రెండేళ్లలో మోదీ, ఒబామా భేటీ అవడం ఇది ఎనిమిదోసారి.ఇటీవల చైనాలో జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులోనూ ఒబామాతోప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. నేతలందరితో కలిసి ఫొటో దిగే సమయంలో వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం జీఎస్‌టీ సవరణలు చేపట్టడంపై ఒబామా ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com